Breaking

6/trending/recent

Featured Section

featured/recent

Slider Wrap

6/slider/recent

Hero Wrap

megagrid/recent

Nature Posts

4/col-left/recent

Sports Post

4/col-right/recent

Recent posts

Show more

యాదవ సామాజిక వర్గ మేయర్ ను పక్కకు తోసి కోట్లాది రూపాయలు విలువ చేసే భూ దందాల కోసం వేరొక సామాజిక తరగతికి చెందిన నేతను మేయర్గా నిలబెట్టిన ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు..ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీని గెలిపించాలి మధురవాడ బొట్ట వాని పాలెం సభలో భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న శ్రీను పిలుపు..భీమిలి నియోజకవర్గం,( ప్రజాబలం న్యూస్ ఆన్లైన: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)ప్రజల భూములు, దేవస్థాన ఆస్తులు కాపాడాలంటే స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి బలం చేకూర్చాలని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. శుక్రవారం రాత్రిమధురవాడ జీవీఎంసీ 5వ వార్డు బొట్టవానిపాలెంలో వైయస్సార్ సిపి ఎస్ఈసీ నెంబర్ మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సమావేశంలో చిన్న శ్రీను పాల్గొన్నారు.వారితోపాటు నియోజవర్గ పరిశీలికలు తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీడీపీకి చెందిన నమ్మి అప్పలరాజు కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి సుమారు 50 మంది వైఎస్సార్సీపీలో చేరారు. మారికవలస నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ కొమ్మాది జంక్షన్, గణేష్‌నగర్ మీదుగా బొట్టవానిపాలెం వరకు ఉత్సాహంగా కొనసాగింది.సభలో ఉత్తరాంధ్ర వైసీపీ జననాయకుడు.చిన్న శ్రీను మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను డేటా సెంటర్ల పేరుతో అప్పగించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. దేవుడి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారే వాటిని దోచుకునే పరిస్థితి రావడం బాధాకరమని విమర్శించారు.అలాగే ప్రభుత్వ భూముల విషయంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, ప్రజా సంపదను కొందరి స్వార్థ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు.ప్రజల తరఫున పోరాడేది వైఎస్సార్సీపీ మాత్రమేనని, సామాన్య ప్రజల హక్కుల కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు.నమ్మి అప్పలరాజు (బాలగోపాలుడు లారీ ఓనర్) ఆధ్వర్యంలో నమ్మి రమణ, నమ్మి నర్శింహులు, ఇయ్యాపు రమేష్, పంచదార్ల శివకృష్ణ, బర్ల శ్రీను తదితరులు పార్టీలో చేరగా, నాయకులు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో..స్థానిక ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.--విమర్శలు గుప్పించిన భీమిలి వైసిపి ఇన్చార్జి చిన్న శ్రీను.

మురళి నగర్ లో డాక్టర్ జ్యోత్నాస్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ వెల్నెస్ క్లినిక్ ప్రారంభం - విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి చిన్న శ్రీను.-

ఐక్య పోరాటాల ఫలితమే విశాఖ రైల్వే జోన్ -- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జే వి ఎస్ ఎన్ మూర్తి.

పి ఎం పాలెం చివర బస్ స్టాప్ రామాలయం వద్ద ఘనంగా హనుమాన్ జయంతి. ప్రత్యేక పూజలు చేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి చిక్కాల. అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం చేసిన విజయబాబు.

*వైజాగ్ షావుకార్స్* నూతన వాసవి క్లబ్ ప్రారంభోత్సవం చేసిన అంతర్జాతీయ వాసవి క్లబ్ డైరెక్టర్ అమర్నాథ్.

Load More That is All

Events Posts

6/sgrid/recent

Technology Posts

2/lgrid/recent