Breaking

6/trending/recent

Featured Section

featured/recent

Slider Wrap

6/slider/recent

Hero Wrap

megagrid/recent

Nature Posts

4/col-left/recent

Sports Post

4/col-right/recent

Recent posts

Show more

విశాఖ సిటీ సమితి పరిధి ఎండాడ సత్య సాయిమందిరంలో భక్తులకు నూతనం గా ఏర్పాటు చేసిన టీవీతోపాటు ఏ సీ నీ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేసిన సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, విశాఖ సిటీ సమితి కన్వీనర్ బి .సాయికుమార్..విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)ఓం శ్రీ సాయిరాం...తేదీ 21.05.2026 గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా, శ్రీ సత్యసాయి భజన మండలి ఎండాడ, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో ప్రతి సోమవారం మరియు గురువారం నామ సంకీర్తన అనంతరం భక్తులు కనులారా స్వామి కదలికలు, స్వామి మాటలు, స్వామి తన నోటి ద్వారా పాడిన భజనలు కనులారా వీక్షించుటకు , వినుటకునూతనంగా ఏర్పాటు చేసిన టెలివిజన్ ( టీవీ), వేసవి కాలంలో నామ సంకీర్తనకు హాజరవు భక్తులుకు మందిరంలో ఎండ వేడిని తట్టుకొలేక ఇబ్బంది పడుతున్న అందరినీ చల్లపరచుటకు ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్ ( ఏసీ) సాయంత్రం నామ సంకీర్తన అనంతరము శ్రీ సత్య సాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు , సిటీ సమితి కన్వీనర్ శ్రీ బి సాయికుమార్ విచ్చేసి ప్రారంభించారు..తదనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంస్థలో సభ్యులు అందరూ కలిసి మెలసి మెలుగుతూ, వివిధ రకములైన సేవలు చేపట్టి మందిరం ను మరింత అభివృద్ధి చెందే విధంగా చేయాలని మందిరం కన్వీనర్ వెంకట రామకృష్ణారావు ను కోరారు.,సిటీ సమితి కన్వీనర్ శ్రీ సాయికుమార్ మాట్లాడుతూ మంచి సంకల్పం ఉంటే ఏ కార్యక్రమం అయిన విజయవంతం అవుతుందని తెలిపినారు.తదనంతరం నిత్యం సేవలు అందిస్తున్న మందిరం సభ్యురాలు సరస్వతి ,శాంతి అనే మహిళకు ఒక అమృత కలిశ ( 20 రకముల వస్తువులు తో కూడిన వంట సామాగ్రి (గ్రోసరీ) బియ్యం తో సహా) అందజేసినారు. ఈ కార్యక్రమంలో మందిరం ఇంచార్జ్ కృష్ణారావు, ఆధ్యాత్మిక ఇంచార్జ్ లు రామచంద్ర రావు,పద్మజ,గ్రూప్ లీడర్ లు అప్పలనాయుడు మాస్టర్,నాగవేణి , బాలవికాస్ ఇంచార్జ్ శ్యామల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జీవీఎంసీ 10వ వార్డులో ఎంవివి సిటీ ప్రాంతం కలపడం సరికాదు--విశాఖ రూరల్ జనసేన ఉపాధ్యక్షులు చందర్రావు. కమిషనర్ కు వినతి.

ఘనంగా తాళ్లపాక అన్నమాచార్యుల 618 వ జయంతి.. ఋషికొండ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సింహాచలం సింహాద్రి అప్పన్న టెంపుల్ లలో శ్రీభక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు చే అన్నమాచార్య కీర్తనలు--దేవస్థానాలలో వైభవంగా సంకీర్తనల విభావరివిశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్; (సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)వాగ్గేయకారులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 618 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ భక్తి సకల దేవత చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ లలిత సప్త స్వరగాన వైభవ కార్యక్రమాన్ని 100మందికి పైగా భక్తులతో రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరల సింహాచలం వరాహ నరసింహ స్వామివారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు.అన్నమాచార్యుల వారు రచించిన కీర్తనలను అత్యంత భక్తి శ్రద్ధలతో రాగయుక్తంగా ఆలపించారు.సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.ఆలయ పరిపాలన అధికారులు,ఈ కార్యక్రమ నిర్వాహకులకు పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో గురువుగారు ఉమశ్రీ గారు వారి శిష్య బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 18వ తారీఖున మరల నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొన వలసినదిగా అభ్యర్థిస్తున్నామని నిర్వాహకులు తెలియచేశారు.

మండిపోతున్న పెట్రోల్ ,డీజిల్ ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలి.---ఏఐటీయూసీ, సిపిఐ డిమాండ్.

Load More That is All

Events Posts

6/sgrid/recent

Technology Posts

2/lgrid/recent