ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు పిలుపు
మధురవాడ :-
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుంచి సిపిఐ నిర్వహించే ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు పిలుపునిచ్చారు. మధురవాడ సిపిఐ కార్యాలయం పోతిన సన్యాసిరావు భవనంలో సోమవారం జరిగిన సీపీఐ ఏరియా సమితి సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి నుంచి గ్రామాలలో ఉండే సమస్యలపై పాదయాత్ర చేయాలన్న భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి నిర్ణయం మేరకు ఈ పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మధురవాడ జాతీయ రహదారి నుండి నగరంపాలెం రహదారి ప్రారంభించి ఏళ్ళు గడుస్తున్నా పూర్తి చెయ్యకపోవడం రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం అన్నారు. స్వతంత్ర నగర్, అయోధ్య నగర్, ద్రోణంరాజు కళ్యాణ మండపం వద్ద, పాత మధురవాడ సహా ఏరియా లో ఉన్న మంచినీరు ట్యాంకులు పాడైపోతున్నాయని వీటి స్థానంలో నూతనంగా ట్యాంకులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు ఎం డి బేగం, జి వేళంగినిరావు, ఎం ఎస్ పాత్రుడు, పి వి అప్పారావు, బి కేశవయ్య, త్రినాద్ తదితరులు పాల్గొన్నారు.